Saturday, August 24, 2013

ఆంధ్ర ప్రదేశ్ ఉనికి, తెలుగు జాతి ఐక్యత నిలవాలంటే ఈ UPA ప్రభుత్వాన్ని వెంటనే పడగొట్టాల్సిందే, వేరు మార్గం లేదు!

ఆంధ్ర ప్రదేశ్ ఉనికి, తెలుగు జాతి ఐక్యత నిలవాలంటే ఈ UPA ప్రభుత్వాన్ని వెంటనే పడగొట్టాల్సిందే, వేరు మార్గం లేదు!

మన ఆంధ్ర [తెలుగు] నాయకులు అంతా చెత్త వెధవలా? మాకు ఈ నిధులు కావాలి, ఈ వసతులు కావాలి, ఈ హామీలు కావాలి అని సోనియాను ప్రాధేయపడడం కాదు వాళ్లు చేయాల్సింది. వెంటనే UPA ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని దాన్ని పడగొట్టడానికి కనీసం 15-20 మంది MP ల గ్రూపు ఏర్పాటు చేసి సాధించాలి. ఈ UPA ప్రభుత్వం ఇప్పుడు పడిపోతే ఇక 2014 ఎన్నికల దాకా రాష్ట్రవిభజనకు ఏ చర్యలూ ఎవరూ తీసుకోలేరు. ఆ తర్వాత ఎన్నికల్లో సమైక్యాంధ్ర frontకు సీమాంధ్ర లో కనీసం 25 MP సేట్లు, తెలంగాణాలో కూడ కనీసం 4-5 సీట్లు సాధించుకోవాలి. ఈ సారి ఎన్నికలు ఐక్యతా వుద్యమ స్ఫూర్తి తో జరగాలి, పోటీలు పార్టీలకు అతీతంగా జరగాలి, స్వార్థ ప్రయోజనాలకోసం రాజీలు పడి, కుట్రలు చేసి, ప్రజలకు తెలుగు జాతికి ద్రోహం చేసిన మూడు ముఖ్య రాజకీయ పార్టీలకూ శృంగభంగం కావించాలి. హిందీ వ్యతిరేక వుద్యమంలో తమిళనాడులో ఉద్యమ పార్టీగా DMK [అప్పట్లో అన్నాదురై నాయకత్వంలో ] ఎలా విజయం సాధించిందో గుర్తు తెచ్చుకోండి. అనామకుడైన ఒక విద్యార్థి నాయకుడు [శ్రీనివాసన్ పేరు అనుకుంటా] కామరాజ్ నాడార్ నే ఓడించిన గొప్ప వైనం గుర్తు చేసుకోండి. అలాగే అస్సాంలో ఉద్యమపార్టీగా అఖిల అస్సాం విద్యార్థి సంఘం [AASU] సాధించిన ఘన విజయాల్ని గుర్తు చేసుకోండి. ఈ అవకాశవాద, జాతిద్రోహ, ప్రజాద్రోహ రాజకీయ పార్టీల్ని నమ్మకండి. సర్వవిధాలా కృషి సలిపి ఈ UPA ప్రభుత్వాన్ని పడగొట్టకపోతే ఇక రాష్ట్ర విచ్చిన్నం ఖాయం. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరై, తెలుగు జాతి ముక్కలు చెక్కలై, 'యాదవ కులానికి పట్టిన వినాశగతి' కి గురై నశించడం నిశ్చయం. ఇరుగు పొరుగు భాషారాష్ట్రాల వైభవం చూచి సిగ్గుతో తల ఎత్తుకోలేక మనమంతా కుమిలిపోవడం ఖాయం. తస్మాత్ జాగ్రత్త!

No comments:

Post a Comment