Friday, October 21, 2011

హైదరాబాద్‌ రాజధాని కాకుంటే విశాలాంధ్ర వద్దు: శ్రీ బూర్గుల రామకృష్ణారావు ప్రకటన గోలకొండ పత్రిక, 22-11-1955

For the convenience of readers the typed out matter of this news item is posted below:

గోలకొండ పత్రిక, 22-11-1955

హైద్రాబాద్ రాజధాని కాకపోతే

విశాలాంధ్ర వద్దు

హైద్రాబాద్ ముఖ్యమంత్రి ప్రకటన:
తిరిగి విశాలాంధ్రవాదులకు కొత్త సమస్య

మైసూరు, నవంబరు 21:

హైద్రాబాద్ ముఖ్యమంత్రి డా. బూర్గుల రామకృష్ణ
రావుగారు ఇక్కడ
నిన్న ఒక ప్రకటన చేస్తూ
ఎట్టి పరిస్థితిలో తమకు విశాలాంధ్ర
అక్కరలేదో
తెలియజేశారు.

తాను హయిద్రాబాద్ రాజధాని అవుతుందంటే్

విశాలాంధ్ర కావాలన్నానుగాని, లేకపోతే
విశాలాంధ్ర
కావాలనేవాడిని కానని శ్రీ రావు
గారు స్పష్టపరిచారు.

బళ్ళారి తాలూకాలకోసం ఆందోళన చేయవద్దనీ, బళ్ళారికోసం కన్నడిగులు ఆందోళన చేస్తే కోలారు కోసం ఆంధ్రులు ఆందోళన చేయవద్దా అని డా. బూర్గుల రామకృష్ణ రావుగారన్నారు. రెండు కర్నాటక రాష్ట్రాల వాదననుకూడ ఆయన ఖండించారు.

డా. రామకృష్ణరావుగారి ఈ ప్రకటనలో తెలంగాణలోని విశాలాంధ్ర వ్యతిరేకతకుగల బల ప్రభావం కన్పిస్తున్నది.

ఇటీవలగా కర్నూలులో ప్రారంభమౌతున్న విశాలాంధ్ర వ్యతిరేకోద్యమంవల్ల కూడ తిరిగి ఆంధ్ర రాజధానీ సమస్య ఉత్పన్నం కాగలదని తెలుస్తున్నది. కర్నూలునుండి రాజధాని తరలించడానికి రాయలసీమ ప్రజలు అంగీకరించడం లేదు. హైద్రాబాద్ రాజధాని కాకున్నట్లయితే విశాలాంధ్రమే వద్దనే వాడినని హైద్రాబాద్ ముఖ్యమంత్రి ప్రకటించడంవల్ల తిరిగి విశాలాంధ్ర వాదులకుకూడా ఒక సమస్య ఉత్పన్నమైందనీ అభిజ్ఞవర్గాలవారంటున్నారు!

* * * * *

No comments:

Post a Comment