Sunday, October 23, 2011

ఆంధ్ర ప్రదేశమంటే మహా తెలంగాణమే

ఆంధ్ర ప్రదేశమంటే మహా తెలంగాణమే నన్న తృప్తి, నమ్మకాలతో శ్రీ బి. నరసింహారావు అనే రచయిత రాసిన గోలకొండ పత్రిక [26-3-1956] లో ప్రచురితమైన ఈ కింది వ్యాసాన్ని శ్రద్ధతో చదవ వల్సిందిగా పాఠకులకు - ముఖ్యంగా వేర్పాటువాద ఉన్మాదంతో ఊగిపోతున్న తప్పదారి పట్టిన తెలంగాణా సోదరీసోదరులకు మా విజ్ఞప్తి.

గోలకొండ పత్రిక కీ. శే. శ్రీ సురవరం ప్రతాప రెడ్డి (1896-1953) గారితో ప్రారంభించబడ్డా, ఎందుకో గాని ఆయన మరణానంతరం, ముఖ్యంగా 1955 నుండీ ఎ. నరోత్తమ రెడ్డిగారి సంపాదకత్వంలో ప్రత్యేక తెలంగాణా వాదాన్ని గట్టిగా సమర్థిస్తూ, విశేషంగా ప్రచురిస్తూ వచ్చింది. కాని అందరు వేర్పాటువాదుల్లాగే 1956 మార్చి తర్వాత, ముఖ్యంగా ప్రధాని నెహ్రూ నిజామాబాదులో 5 మార్చి 1956 నాడు చేసిన [విశాలాంధ్ర ఏర్పాటు] ప్రకటన తర్వాత ఈ గోలకొండ పత్రికకూడ పరిస్థితులకు అనువుగా సర్దుకునిపోయింది. ఇప్పటి వేర్పాటువాదుల్లా పూర్తి ఉన్మత్తులు కాలేదువారు. లేదా పిచ్చి ఆవేశకావేషాల్లో తమ జాతి పుట్టుక పరిణామాలనే నిరాకరిస్తూ, తెలుగుతల్లినే అవమానపరుస్తూ, తమ సాంప్రదాయిక వీరుల్నే తెగడే పిచ్చి పనులేవీ వారు చేయలేదు. తెలంగాణాకు యిచ్చిన రక్షణలే ప్రత్యేక రాష్ట్రం సాటి అనే సంతృప్తితో, యిక విశాలాంధ్ర వైభవాన్నీ, ప్రాభవాన్ని పెంపొందించే దిశగా ముందుకు సాగారు. అందుకు ఈ వ్యాసం ఒక ఉజ్వల తార్కాణం:

గోలకొండ పత్రిక, 26 మార్చి 1956, పుట 2:

ఆంధ్ర జాత్యవతరణ

- బి. నరసింహారావు.

తెలుగు వెలుగుతో భారతావనిని సుప్రకాశితం చేసిన వాళ్లల్లో తెలుగువాళ్ళు అపూర్వులు; అద్వితీయులు. భారతీయ సంస్కృతిని, భారతీయ నాగరికతను, హిందూ స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ చంద్రగుప్తుని కాలంవరకే ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై ప్రభుత్వ మేర్పరచి శబాసనిపించుకున్న తెలుగువాళ్లకు ఈ స్వతంత్ర భారతంలో తిరిగి 1953 ఆ మహదవకాశం లభించడం నిజంగా గర్వనీయాంశం; సందేహించాల్సిన అవసరం లేదు.

దురదృష్టంవల్ల మాతృస్థానంతో వేరవడం, అరవలతో కొంత పొత్తు కలవడం వల్ల తెలంగాణా దివ్యజ్యోతుల [ని] ర్ణీత ధర్మాన్ని విస్మరించడం రెండు కోట్ల తెలుగువాళ్ళకు ఘటించింది. మాతృస్థానం నుండి వీచిన జాతీయ వాయువువల్ల యేర్పడిన వ్యామోహం నిర్మూలమవడం నిశ్చయం.

ఆంధ్రరాజ్యావతరణానికి అనేకులు అనేక కారణాలు నిశ్చయించారు. అమరజీవి ఆత్మాహుతి అని కొందరనుకుంటే, చేతులార ముగ్గుబోసి కట్టిన మదరాసు నగరవ్యామోహాన్ని వదలుకోవడమని కొందరనుకుంటున్నారు. భారతీయ స్వాతంత్ర్య సమయంలో అసమానమైన త్యాగానికి అగ్రగాములైనందున అని మరి కొందరనుకుంటూంటే, యింకొకరు యింకో విధానం తేల్చేస్తున్నారు. మొత్తంమీద రాజ్యావతరణంతో అప్రతిభ షేముషీ విజ్ఞానాన్ని అసమానమైన నిపుణతని అమోఘమైన కార్యసాధనా పటిమని ప్రదర్శింపజేస్తూ అఖిల భారతాభ్యుదయానికి ముందు అడుగు వేశే నిర్ణీత బాధ్యతని పొల్లుపోకుండా తెలుగువాళ్లు సార్థక పరచాలి. (ఇంకా వుంది)

3 comments:

  1. అందరు వేర్పాటువాదుల్లాగే 1956 మార్చి తర్వాత, ముఖ్యంగా ప్రధాని నెహ్రూ నిజామాబాదులో 5 మార్చి 1956 నాడు చేసిన [విశాలాంధ్ర ఏర్పాటు] ప్రకటన తర్వాత ఈ గోలకొండ పత్రికకూడ పరిస్థితులకు అనువుగా సర్దుకునిపోయింది.
    a great lie!..it changes its way because sarvottama reddy given rajyasabha membership by congres party. after that, both sarvottama reddy and his papers keeps scilence on telangana. the bloody congress started the same tactice even from those days.

    ReplyDelete
  2. Then it is for Savaal Reddy to enlighten us who consistently opposed Vishalandhra even after 5 March 1956 or more pertinently after 1 November 1956. It is for him to produce evidence in this regard. For our part, despite all attempts, we did not find any such opposition to Andhra Pradesh and craving for separate Telangana after 1956 until 1968.

    ReplyDelete
  3. read 'efforts' (a better term) in place of 'attempts'.

    ReplyDelete